30.7 C
Hyderabad
May 13, 2024 01: 56 AM
Slider ప్రకాశం

వైసీపీ నేత సుబ్బారావుపై దాడి చేసిన సొంత పార్టీ నేతలు

#attack

ఓ మంత్రి, ఎమ్మెల్యేల మాటలతో పార్టీకి నష్టం జరుగుతుందని ఇటీవల మంత్రి బాలినేని బర్త్ డే వేడుకల్లో మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై మంత్రి మనుషులు దారుణంగా దాడి చేసి హింసించారు. నిన్న రాత్రి సుబ్బారావు ఇంటిపై దాడి చేసి 15 మంది బీభత్సం సృష్టించగా సుబ్బారావు గుప్తా ప్రాణభయంతో పారిపోయాడు. ఓ లాడ్జ్‌లో ఉన్న సుబ్బారావు ఆచూకీ కనిపెట్టి మరీ మంత్రి మనుషులు దాడి చేశారు. సుబ్బారావుపై దాడి చేసిన వారిలో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రధాన అనుచరుడు సుభానీ ఉన్నట్లుగా చెబుతున్నారు. సుబ్బారావు వ్యాఖ్యలపై ఆగ్రహంతో దాడి చేసిన సుభానీ అతడిని చిత్ర హింసలు పెట్టాడు. పార్టీకి నష్టం కలుగుతుందనే అలా మాట్లాడానన్న సుబ్బారావు మాటలు ఎవరూ పట్టించుకోలేదు. చివరికి బాలినేనికి క్షమాపణ చెప్పాలంటూ గుప్తాను మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణ చెప్పించారు. తాను దాడి చేస్తున్న దృశ్యాల్ని వీడియో తీసి మరీ వార్నింగ్ ఇచ్చారు. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Related posts

కరోనా క్లీనిక్: మాధ్యమాలకు బాధ్యత ఎక్కువ

Satyam NEWS

రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా అవగాహన

Satyam NEWS

మారు మూల ప్రాంతంలో వెరైటీగా పిజ్జా కార్నర్

Satyam NEWS

Leave a Comment