నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణానికి చెందిన ప్రముఖుడు మేకల బాలస్వామి దశ దిన కర్మ కార్యక్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మేకల బాలాస్వామి కుమారులు కిషోర్, కిరణ్ లు జూపల్లి కృష్ణారావుకు ప్రధాన అనుచరులుగా ఉన్నారు.
తనకు అత్యంత సన్నిహితులైన వారి తండ్రి మరణించడంతో దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పులమాలతో జూపల్లి కృష్ణారావు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బాలస్వామి కుమారులను ఓదార్చి వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో జూపల్లి వెంట కొల్లాపూర్ పట్టణ కౌన్సిలర్ లు, సింగిల్ విండో డైరెక్టర్ లు, ఇతర ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు జూపల్లి ప్రధాన అనుచరులు ఉన్నారు.