రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇక నుంచీ ప్రతీ ఆదివారం గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర నేత పాలవలస యశస్వి అన్నారు.
జనసేన పార్టీ విజయనగరం ఇంచార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి తలపెట్టిన గ్రామ గ్రామానా జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం నియోజకవర్గ పరిధిలో సారిక లో ఆమె ప్రజా దర్బార్ నిర్వహించారు.
ముందుగా సారిక గ్రామంలో, జనసేన పార్టీ సిద్ధాంతాలు, గ్రామ గ్రామాన జనసేన కార్యక్రమ వివరాలతో కూడిన కరపత్రాలను జనసైకులు బొబ్బాది చంద్రునాయుడు (చందు), రాజేష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరిస్తూ పంచిపెట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకురాలు పాలవలస యశస్వి సారిక లో రచ్చబండ వద్ద ప్రజా దర్బార్ ను నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలనుంచి వచ్చిన వినతులు తీసుకుని ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను తీర్చడమే జనసేన ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగానే ప్రతీ ఆదివారం నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాల్లోను గ్రామ గ్రామాన జనసేన పేరుతో ప్రజా దర్బార్ ను, కార్పొరేషన్ పరిధిలో కూడా నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకొని, ఆసమస్యల పరిష్కరించేందుకు జనసేన పార్టీ నిర్విరామంగా కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలనుంచి పెన్షన్లు, రేషన్ కార్డ్లు అర్ధాంతరంగా ఆపివేశారని వినతులు వస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ,సాయి, సందీప్, సాయి,నాయుడు, జగదీష్, సియి, పార్టీ నేతలు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు (బాలు), రవితేజ, తదితరులు పాల్గొన్నారు.