గత 2 రోజులుగా హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్టున్న వర్షాలతో పలు కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలు పూర్తిగా నీట మునగటంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన లోతట్టు ప్రాంతాలను పరిశీలించి అక్కడి స్టానిక ప్రజలకు అరటిపండ్లు, బ్రెడ్ తో పాటు ఆహార పదార్ధాలను పంపిణీ చేసారు.
ముంపుకు గురైన ప్రాంతాలపై ప్రభుత్వం స్పందించి వారికి అండగా నిలబడాలని సీఎం కేసీఆర్ కు సూచించారు.
హైదరాబాద్ నగరాన్ని విస్వనగరంగా చేస్తామని చెబుతున్న మంత్రి కేటీఆర్ ఇప్పటికైనా ప్రజలకు అండగా నిలబడాలని కోరారు.