33.7 C
Hyderabad
April 29, 2024 01: 27 AM
Slider నల్గొండ

వైజాగ్ గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్టు

#SuryapetPolice

వైజాగ్ నుండి గంజాయి తెచ్చి హైదరాబాద్, మహారాష్ట్ర లలో అమ్మే ముఠాను స్యూరాపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నలుగుర్ని అరెస్టు చేసి వారి నుంచి 1.30 క్వింటాళ్ల గంజాయిని సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా యస్.పి R. భాస్కరన్ నేడు ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు.

ఈరోజు తెల్లవారుజాము నుండి పెనపహాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో జిల్లా సీసీఎస్ పోలీసులు, పెనపహాడ్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ జాయింట్ రైడ్స్ లో ఈ ముఠా పట్టుబడ్డదని ఆయన తెలిపారు. ఆనంతారం అడ్డరోడ్డు వద్ద అనుమానస్పద కార్లను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా ఒక కారులో 60 Kg ల గంజాయి పొట్లాలు, మరొక కారులో 70 kg ల గంజాయి పొట్లాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

4 గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక కారు డ్రైవర్, మరొక నిందితుడు అక్కడి నుండి తప్పించుకున్నారు. రెండు కార్లు స్వాధీనం చేసుకుని అందులోని 130 kg ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పెనపహాడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

ఈ జాయింట్ రైడ్స్ నందు CCS ఇంస్పెక్టర్ నిరంజన్, SI రంజిత్, ccs సిబ్బంసి కృష్ణ, నర్సింహారావు, రమేష్, దుర్గాప్రసాద్, గురుస్వామి, శ్రీను, PS సిబ్బంది కనకరత్నం జాఫర్ అలీ పాల్గొన్నారు.

Related posts

మద్నూర్ దక్షిణ ముఖ ఆంజజేయుడికి రికార్డు స్థాయి ఆదాయం

Satyam NEWS

ట్రాజెడీ: నేల రాలిన నెలల బాలుడు

Satyam NEWS

చదువులతో బాటు యువత క్రీడల్లో రాణించాలి

Satyam NEWS

Leave a Comment