వైజాగ్ నుండి గంజాయి తెచ్చి హైదరాబాద్, మహారాష్ట్ర లలో అమ్మే ముఠాను స్యూరాపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నలుగుర్ని అరెస్టు చేసి వారి నుంచి 1.30 క్వింటాళ్ల గంజాయిని సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా యస్.పి R. భాస్కరన్ నేడు ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు.
ఈరోజు తెల్లవారుజాము నుండి పెనపహాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో జిల్లా సీసీఎస్ పోలీసులు, పెనపహాడ్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ జాయింట్ రైడ్స్ లో ఈ ముఠా పట్టుబడ్డదని ఆయన తెలిపారు. ఆనంతారం అడ్డరోడ్డు వద్ద అనుమానస్పద కార్లను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా ఒక కారులో 60 Kg ల గంజాయి పొట్లాలు, మరొక కారులో 70 kg ల గంజాయి పొట్లాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
4 గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక కారు డ్రైవర్, మరొక నిందితుడు అక్కడి నుండి తప్పించుకున్నారు. రెండు కార్లు స్వాధీనం చేసుకుని అందులోని 130 kg ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పెనపహాడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఈ జాయింట్ రైడ్స్ నందు CCS ఇంస్పెక్టర్ నిరంజన్, SI రంజిత్, ccs సిబ్బంసి కృష్ణ, నర్సింహారావు, రమేష్, దుర్గాప్రసాద్, గురుస్వామి, శ్రీను, PS సిబ్బంది కనకరత్నం జాఫర్ అలీ పాల్గొన్నారు.