ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో రోజుకోరకమైన నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్కు రాజీనామా చేసిన ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి, OBC నాయకుడు దారా సింగ్ చౌహాన్ ఆదివారం సమాజ్ వాదీ పార్టీలో చేరారు. శుక్రవారం మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ, ఐదుగురు బిజెపి ఎమ్మెల్యేలు మరియు అప్నా దళ్ (సోనేలాల్) నుండి ఒకరు సమాజ్ వాదీ పార్టీలో చేరారు. చౌహాన్తో పాటు, ప్రతాప్గఢ్ జిల్లాలోని విశ్వనాథ్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అప్నా దళ్ (సోనేలాల్) ఎమ్మెల్యే ఆర్కె వర్మ కూడా ఆదివారం సమాజ్ వాది పార్టీలో చేరారు. 2017లో ఉత్తరప్రదేశ్లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, అది ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే నినాదాన్ని ఇచ్చింది… కానీ, ‘వికాస్’ (అభివృద్ధి) కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే జరిగింది. మిగిలిన వారిని ప్రభుత్వం వదిలేసింది అని ఈ సందర్భంగా చౌహాన్ అన్నారు. సమాజ్వాదీ పార్టీని తన సొంత ఇల్లుగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలను మార్చి, అఖిలేష్ యాదవ్ను మరోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేస్తాం అని ఆయన ప్రకటించారు.
previous post