కరెంట్ ను పొదుపుగా వాడుకోవాలని, ఆటో మేటిక్ స్టార్టర్ లు ఆఫ్ చేయాలని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు
రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఉదయం 14017 మెగా వాట్ల డిమాండ్ నమోదు అయిందని, గత సంవత్సరం తో పోల్చితే 3082 మెగా వాట్ల విద్యుత్ వినియోగం అధికం అయిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగం పెరుగుతుందని ఆయన వివరించారు.
గత మార్చి నెలలో 14160 మెగా వాట్లు రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వినియోగం కానీ ఈసారి డిసెంబర్ నెలలోనే ఇంత వినియోగం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో 10935 మెగా వాట్ల అత్యధిక డిమాండ్ కాగా ఈ సంవత్సరం 14017 మెగా వాట్లు వినియోగం జరిగిందని తెలిపారు. విద్యుత్ ఇంజనీర్ లు,అధికారులు కష్టపడి పని చేస్తూ నిరంతరం విద్యుత్ సరఫరా చేయడం పట్ల సీఎం కేసీఆర్ అభినందించారని ప్రభాకర్ రావు తెలిపారు.
రానున్న యాసంగిలో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో 15500 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా కూడా సరఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఇంజనీర్ లు,అధికారులు కష్టపడి పని చేసి నిరంతరం విద్యుత్ సరఫరా ఆటంకం రాకుండా చేస్తున్నారని, 15500 వేల మెగా వాట్ల డిమాం