శ్రీకాకుళం జెసి.ఐ గ్రీన్ సిటీ వారోత్సవాల సందర్భంగా 9వ తేదీ నుండి15వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయని జెసిఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ మని శర్మ శనివారం గొంటివీధిలో గల ఒక హాల్ లో జరిగిన కార్యక్రమంలో తెలిపారు. ఇందులో భాగంగా గ్రీన్ సిటీ ఆధ్వర్యంలో మొదటి రోజు కార్యక్రమంగా రక్తదాన కార్యక్రమాన్ని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ద్వారా చేపట్టారు. ముఖ్య అతిథులుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ జోగి నాయుడు, లైన్స్ హర్షవల్లి ప్రెసిడెంట్ హారిక ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ రక్త నిల్వలు తక్కువగా ఉన్న సమయంలో ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం హర్షనీయమన్నారు.
నేత్ర దానం కోసం 15 మంది సంతకాలు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. జెసి ప్రెసిడెంట్ మణిశర్మ నేత్రదానం, సభ్యులైన కళ్లేపల్లి ఉష రాణిలు అవయవదాన చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని, శివాని ఇంజనీరింగ్ విద్యార్థులు రక్త దానం చెయ్యటం కూడా గొప్పవిషయమని, ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు జెసిఐ గ్రీన్ సిటీని హర్షం వ్యక్తం చేశారు. ఈ వారం రోజులు చేయబోయే కార్యక్రమాలు అన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సినేటర్ మధుబాబు, వరలక్ష్మి, మల్లేశ్వరరావు, గణపతి , ఉష, డాక్టర్. ప్రవీణ్, డాక్టర్. ఎన్ ప్రభు, బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ మణికంఠ, రౌత్ సుప్రజ, ఐపీపీ సాయి బాబా, పొడుగు. చరణ్, డా. పైడి. ప్రదీప్, కె.శివ, నంది. ఉమా శంకర్, తదితరులు పాల్గొన్నారు.