సూర్యాపేట జిల్లా కోదాడ RTO సుభాష్ ఆర్ డి ఓ గా పదోన్నతి పొందిన సందర్భంగా హుజూర్ నగర్ లారీ అసోసియేషన్ నూతన కమిటీ వారికి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. రవాణా శాఖా పరంగా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాల్సిందిగా ఆయన కోరారు.
వాటిని పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని RDO గా పదోన్నతి పొందిన సుభాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ లారీ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు కోతి సంపత్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, గౌరవ సలహాదారులు జక్కుల కొండలు, సెక్రెటరీ కేవీ ప్రతాప్, కోశాధికారి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రెటరీ రవి, తదితరులు పాల్గొన్నారు.