29.7 C
Hyderabad
April 29, 2024 10: 18 AM
Slider నల్గొండ

పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ధర్నా

#Kodada Congress Party

పెట్రోల్,డీజిల్ ధరలు అసాధారణ పెంపుకు వ్యతిరేకంగా కోదాడ పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కోదాడ RDO కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలిపి RDO కిషోర్ కుమార్ కు మెమోరాండం ఇచ్చారు.

ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ రేట్లు ప్రతిరోజు పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని,తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, వీటి ప్రభావం నిత్యావసర వస్తువులపై పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంగవీటి రామారావు, ధనమూర్తి, కంపాటి శ్రీను, పాలకి అర్జున్, వాసుదేవరావు, ముస్తఫా, సైదా నాయక్, నిరంజన్, రెడ్డి, యాదగిరి, కోటిరెడ్డి, పాలూరి సత్యనారాయణ, బాగ్దాద్, రవి నాయక్, ప్రవీణ్, మోహన్ రావు, పిడతల శ్రీను, ప్రవీణ్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

డప్పు రమేష్ జీవిత త్యాగం వెలకట్టలేనిది

Satyam NEWS

ట్రాజెడీ:పెళ్ళైన రోజే బరాత్లో వరుడి మృతి

Satyam NEWS

కూతురినే కాటేసిన క‌న్న‌తండ్రి… ఫ‌లితం..శ్రీకృష్ణ జ‌న్మ‌స్థానం

Satyam NEWS

Leave a Comment