ములుగు జిల్లా ములుగు మండలంలోని కొత్తూరు గుట్టపై ఉన్న పురాతన ఆలయం అద్భుతంగా ఉందని ములుగు ఏ ఎస్ పి పోతురాజు సాయి చైతన్య అన్నారు.
ఆదివారం ఉదయం ఆయన దేవుని గుట్ట ఆలయాన్ని సందర్శించారు. గుట్టపై నిర్మించిన ఈ ఆలయాన్ని పరిశీలించి నిర్మాణశైలికి మంత్రముగ్ధులు అయ్యారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సుమారు పదిహేను వందల ఏళ్లనాటి ఈ పురాతన ఆలయం ప్రకృతి సంతరించుకున్న అడవిలో గుట్టపై ఉండడం అద్భుతమని అన్నారు.
ఆలయ శిఖరం పిరమిడ్ ఆకారంలో ఉండడంతోపాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంకొర్ వాట్ తో పోలిక ఉందని తెలిపారు.
బౌద్దుల ఆనవాళ్లు ఉండడంతోపాటు ఇసుకరాతి ఇటుకలతో నిర్మాణమై ఉండడం గొప్ప విషయమని తెలిపారు. ఏఎస్పీ వెంట ఎస్ఐ హరికృష్ణ , పోలీస్ సిబ్బంది ఉన్నారు.