పెట్రోల్ డీజిల్ నిత్యవసర సరుకుల పై ధరలు అత్యధికంగా పెంచి ప్రజలను దోచుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు గుణపాఠం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని చిట్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య యాదవ్ అన్నారు శనివారం పార్టీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.
తదనంతరం పెట్రోల్ డీజిల్ పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్ అయితే ప్రభాకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే కాలంలో మోడీ సర్కార్ దింపి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను చిన్నచూపు చూస్తుందని అన్నారు.
దేశ రాష్ట్రాలను గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న పార్టీ కార్యక్రమాలను అధిక సంఖ్యలో చేస్తూ గుంపులుగుంపులుగా జనాన్ని పోవు చేస్తున్నారని తెలిపారు. కరోనా వైరస్ పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేసేందుకు ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జడల పూలమ్మ, జమండ్ల జయమ్మ,రేముడల లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు, జిల్లా నాయకులు వేల్పూరు నాగిరెడ్డి , యూత్ కాంగ్రెస్ నాయకులు కందటి రమేష్ రెడ్డి ,వర కాంతం శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బోడ స్వామి, వడ్డేపల్లి కృష్ణ, గణేష్, ముత్తి రెడ్డి, బోడ శ్రీనివాస్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు