34.7 C
Hyderabad
May 5, 2024 00: 04 AM
Slider తూర్పుగోదావరి

ఫ్యాన్ కు ఓటేసినందుకు విసనకర్రలు, కొవ్వొత్తులు స్థాయికి వచ్చాం

#tdp

కరెంట్ కోతలతో రంజాన్ ఉపవాస దీక్షలకు ఆట౦క౦

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తుండగా మితిమీరిన కరెంటు కోతలతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.డీ ఆన్సర్ పేర్కొన్నారు.

వైసిపి ప్రభుత్వం విధిస్తున్న కరెంటు కోతలకు నిరసనగా  సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆద్వర్యంలో  శుక్రవారం మైనార్టీ నాయకులు   జగన్నాథపురం ఆజాం మసీదు నందు నమాజ్ సమయంలో విసనకర్రలు ప౦పిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆన్సర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు విని ఫ్యాన్ గుర్తికి ఓటే వేసి గెలిపి౦చుకునందుకు నేడు ప్రజలకు విసనకర్రలు కొవ్వొత్తులే దిక్కయ్యాయిని అన్నారు.

ఆ నాడు ప్రతిపక్షంలో వుండగా జగన్మోహన్రెడ్డి ప్రచారసభల్లో కరెంట్ చార్జీలు బాదుడే బాదుడు అంటూ రాగాలు తీశారని నేడు ఆ బాదుడే బాదుడు రాగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని తీసేస్తాను చెప్పితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి వైసిపి పార్టీకి ఓటు వేస్తే కరెంట్ చార్జీలు తగ్గించకు౦డా మొత్తం కరెంటే లేకుండా చేస్తున్నారని అన్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందిస్తే నేడు జగన్ రెడ్డి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు విసినికర్రలు వాడకాన్ని గుర్తు చేస్తున్నాడని  విమర్శించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు ఎస్ కె రహీమ్, ఫైసల్, అన్వర్, జమీల్’ మన్సూర్, జాగీర్, ఖాన్, వళ్లీ జాన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రాణాలు తోడేస్తున్న అనధికార చిట్ ఫండ్లు

Bhavani

కులవృత్తులను ప్రోత్సహించడమే కేసీఆర్ లక్ష్యం

Satyam NEWS

కొత్త వ్యవసాయ చట్టానికి నేడు నిరసన

Satyam NEWS

Leave a Comment