బీజేపి తీసుకువచ్చిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ పట్టణంలో రేపు కిసాన్ చౌక్ లోని ధనలక్ష్మి లార్జ్ ముందర పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నామని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ MLC రాములు నాయక్ హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలలోని ప్రతీ గ్రామాలనుండి రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. రైతు వ్యతిరేక బిల్లు లో గల లోపాలను రాములు నాయక్ రైతులకు వివరిస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుడిపెల్లి నగేష్, మాజి కోఆప్షన్ మెంబర్ సాదిక్, MD. ఖయ్యాం, MA.షకీల్, కలీమ్, మోసిన్ పటేల్, మల్లేష్ యాదవ్, షిండె, ముర్తుజా, చంద్రాల రాహుల్, అన్నూ బై, కరీమ్, అజీజ్, గఫార్, అమ్జద్, అస్బత్ లు పాల్గొన్నారు.