దిశ డీఐజీ గా పదోన్నతి పై వెళుతున్న విజయనగరం జిల్లా ఎస్పీ గా పని చేసిన బీ.రాజకుమారి కి ఆర్మర్డ్ రిజర్వు పోలీసు బ్యారక్స్ లో ఘనంగా ఫేర్వల్ నిర్వహించారు.
వర్షం కారణంగా గంట ఆలస్యంగా పరేడ్ ప్రారంభం అయ్యింది. నగరంలో మ జంక్షన్ వద్ద ఉన్న బంగ్లా నుంచీ ప్రోటోకాల్ గా ట్రాఫిక్ ఎస్ఐ లు భాస్కరరావు, హరిబాబు లు డీఐజీ మేడం ను పరేడ్ గ్రౌండ్ కు తీసుకువచ్చారు.
అక్కడే ఏఎస్పీ లు సూర్యచంద్రరావు, సత్యనారాయణ లు శాఖ పరంగా స్వాగతం కలికారు.
అనంతరం పరేడ్ నిర్వాహకులు ఈశ్వర్ అయిదు వింగ్ లతో డీఐజీ గా పదోన్నతి పై వెళుతున్న రాజ కుమారికి ఫేర్వల్ నిర్వహించారు. ఈ కార్యక్రమం మొత్తం ఏఆర్ డీఎస్పీ శేషాద్రి ఆధ్వర్యంలో జరిగింది.