రైతుల హక్కుల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతు సోదరులకు మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు.
నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అరవింద బాబు మాట్లాడుతూ రైతే రాజు అనే నినాదం కేవలం మాటలతోనే సరిపెడుతున్నాం కానీ ఆచరించడంలేదని అన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదనే విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ రైతు అధ్యక్షుడు వీరారెడ్డి, సింహాద్రి యాదవ్, కడియాల రమేష్,నాగతు శౌర్యయ్యా, వెన్న బాలకోటి రెడ్డి, వేములపల్లి నరసయ్య,బండారుపల్లి విశ్వరరావు,
దాసరి ఉదయశ్రీ,వల్లెపు నాగేశ్వరావు, కొల్లి వెంకటేశ్వర్లు,వాసిరెడ్డి రవి,మక్కెన ఆంజనేయులు,గొట్టిపాటి జనార్ధన్ బాబు,రాయల్ శ్రీను,మొండితోక రామారావు,
పులుకూరి జగ్గయ్య,గడ్డం రాజా,గడ్డం కరిముల్లా,చల్లా సుబ్బారావు,యాడ్స్ వలి,పులిమి రామిరెడ్డి, సుభాని, యమలయ్య, సంజీవ రావు,యార్లగడ్డ లింగయ్య,భాష,కడియం కోటి సుబ్బారావు, నాగ సుధీర్,నవీన్,బాలు,శాఖమూరి మారుతి,కళ్యాణం రాంబాబు, నాగూర్,ముoడ్రు శివ కోటేశ్వరరావు, కాసిం తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట తెలుగుదేశం పార్టీ రూపొందించిన నూతన క్యాలెండర్ ను ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ ఆవిష్కరించారు.