కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పి.హెచ్.డి పరిశోధనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా లో పలు గ్రామాలలో పర్యటించారు.
తూర్పు గోదావరి జిల్లా అట పాక మండలం చేమిలి వాగు గోత్తీ కోయ గూడెం, వి. ఆర్.పురం మండలం లోని సున్నం మట్కా గూడెం లో ఆమె పర్యటించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఊరికి దూరంగా అడవిని నమ్ముకొని అడవే ఆధారంగా బ్రతుకుతున్న ఆదివాసీ గో త్తి కోయ గుడలలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.
ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి ఒక పుస్తకం ద్వారా తెలియ చేస్తానని సీతక్క అన్నారు.
అదే విధంగా లయోలా ఇంటిగ్రెటెడ్ డెవలప్ మెంట్ సొసైటీ పాఠశాలలో విద్యార్థులతో కొద్ది సేపు ముచ్చటించారు అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభా కాంక్షలు తెలిపారు.