సుమన్ కవిత..ప్రధాన పాత్రల్లో, ఆలం సందీప్, ప్రమీల హీరో హీరోయిన్లుగా, బొంతు శ్రీనివాస్ దర్శకత్వంలో, ఏ.వి.భాస్కర్ నిర్మిస్తున్న నువ్వు నేను ఒక్కటైతే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఏ.వి.భాస్కర్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్ పై నిర్మిస్తున్న నువ్వు నేను ఒక్కటైతే సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ వారు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఒక విభిన్నమైన కథతో మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని నిర్మించారని సెన్సార్ సభ్యులు చెప్పడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇక దర్శకుడు మాకు ఏదైతే చెప్పాడో అంత క్లియర్ గా పక్కా ప్లానింగ్ తో సినిమాని తీశారు.
అలాగే కొత్తగా సినిమాని నిర్మిస్తున్న మాకు సుమన్, కవిత మంచి సపోర్ట్ చేసారు. నటి నటుల టెక్నీషియన్స్ పూర్తి సపోర్ట్ ఇచ్చారు. ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు విభిన్నమైన కథతో మంచి సినిమాని నిర్మించాం. థియేటర్స్ ఓపెన్ కాగానే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు.
దర్శకుడు బొంతు శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘విభిన్న కథ కథనాలతో నేటి ట్రెండ్ కి తగ్గట్టు గా ఈ సినిమా వుంటుంది. సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పూర్తి చేసాము. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాని మెచ్చుకోవడం నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నిర్మాత సహకారం మరచిపోలేను.
నేను ఎది అడిగితే అది ఇచ్చి నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చారు ఎక్కడా ఖర్చుకి వెనుకాడలేదు. పాటలు సిచ్యువేషన్ కి తగ్గట్టు వుంటాయి త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తాము అన్నారు.
సుమన్, కవిత..ప్రధాన పాత్రల్లో, ఆలం సందీప్, ప్రమీల హీరో హీరోయిన్లుగా, జెన్నీ, అశా,విజయభాస్కర్, కాకినాడ నాని సాయి వర్ధన్ గౌడ్ తదితరులు నటిస్తున్నారు. నిర్మాత: A.V. భాస్కర్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు దర్శకత్వం: బొంతు శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: శూలం ప్రసాద్, మ్యూజిక్: చిన్ని కృష్ణ, ఎడిటింగ్: వి.నాగిరెడ్డి, డాన్స్: బండ్ల రామారావు, ఫైట్స్: అవినాష్, పాటలు: మాతుమురి రామారావు.