నిర్మల్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తెలిపారు. ఇందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఎన్. ఇంద్రకరణ్ రెడ్డి సూచనల మేరకు పట్టణంలో అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయని అన్నారు.
రోడ్డు విస్తరణ పనుల దృష్ట్యా ఈ రోజు సోఫీ నగర్ నుండి మంచిర్యాల్ చౌరస్తా వరకు రోడ్డు అడ్డంకులను తొలగించారు. దర్గా షరీఫ్ సోఫీ నగర్ ప్రహరి గోడ ను దర్గా పీఠాధిపతి సజాదా నాషిన్, సోఫీ దిశాన్ పాషా, దర్గా సభ్యులు, కాలనీవాసుల సహకారంతో తొలగించారు. ప్రహరీ గోడను తొలగించి ఇరువైపుల రోడ్డు వెడల్పు పనులను నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ సంపంగి రవి, 14వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మతిన్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, నిర్మల్ మున్సిపల్ ఈ ఇ వినయ్, సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్, పతికే శీను మాజీ కౌన్సిలర్, మున్సిపల్ సిబ్బంది, కాలనీ ప్రజలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.