కడప జిల్లా రాజంపేటలోని ప్రభుత్వ వైద్యశాలలో రాజంపేట లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో రాజంపేట పట్టణ, రూరల్ మండలంలో పనిచేస్తున్న ఆశా ఉద్యోగులకు, ప్రభుత్వ ఆసుపత్రి పారిశుధ్య కార్మికులకు గొడుగులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్లి సేవలు చేస్తున్నందుకు వారి సేవలు గుర్తించి రాజంపేట లైన్స్ క్లబ్ వారికి గొడుగులు పంపిణీ చేసింది.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు షేక్ అబ్దుల్లా, వై సుబ్రమణ్యం రాజు, వెంకట సుబ్బయ్య, పోతుగుంట రమేష్ నాయుడు, శరత్ కుమార్ రాజు ,టి. లక్ష్మీనారాయణ, సంగరాజు సుబ్రమణ్యం రాజు, విజయ్ కుమార్ రాజు, డాక్టర్ బాలరాజు, ఎం రామకృష్ణ నాయుడు ,రామచంద్రరాజు, నాసిరుద్దీన్ ,మల్లిశెట్టి సుబ్బరాయుడు, విజయ్ కుమార్ రాజు, ప్రభుత్వ డాక్టర్లు డాక్టర్ అనిల్ వెంగల్ రెడ్డి, డాక్టర్ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.