27.7 C
Hyderabad
May 4, 2024 07: 15 AM
Slider ఖమ్మం

విద్యార్థులకు పిఎస్ఆర్ ట్రస్టు తరుపున ఆర్థిక సాయం

#PSR Trust

ప్రతిభ కలిగిన విద్యార్థులకు పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్టు తరుపున చేయూతనందించడం అభినందనీయమని ఆర్సి జి. జ్యోతి తెలిపారు. పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్టు తరుపున ఎన్టి రాయపూర్లో సీటు సాధించిన గుగులోత్ లావణ్య, కెయు క్యాంపస్లో ఇంజనీరింగ్ సీటు సాధించిన వల్లపు సిరివెన్నెలకు ఒక్కొక్కరికి రూ. 15 వేల ఆర్థిక సహయాన్ని అందించారు.

బుధవారం రఘునాథపాలెం శారద కళాశాల ప్రాంగణంలో గల దానవాయిగూడెం బిసి గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ట్రస్టు ఛైర్మన్ పరిశ పుల్లయ్య ఆర్సవా జి. జ్యోతి, ప్రిన్సిపాల్ పంజా మాధవి చేతుల మీదుగా లావణ్య, సిరివెన్నెలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సహయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్సివో మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులకు పిఎస్ఆర్ ట్రస్టు అందిస్తున్న ప్రోత్సాహం మరువ లేనిదన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.

ట్రస్టు ఛైర్మన్ పుల్లయ్య మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డుకాకూడదని తమ ట్రస్టు తరుపున చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని తెలిపారు. ఉన్నత శిఖరాలను అధిరోహించిన తర్వాత తమ వంతుగా ఇతరులకు సహయపడాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు సామాల నర్మద, ఉపాధ్యాయులు నాగమణి, విజయనిర్మల, స్వప్న, సుజాత, రమాదేవి, దివ్య స్పందన, శిరీష, నూర్జహాన్, సుకన్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

అట్రాసిటి బాధితులకు వెంటనే సహాయం

Satyam NEWS

కెమెరా ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Satyam NEWS

మతి భ్రమించి మాట్లాడుతున్న రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

Leave a Comment