కరోనా లాక్ డౌన్ విరామం తర్వాత మహేష్ బాబు మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సర్కారువారి పాట చిత్రం షూటింగ్ నేటి నుంచి స్టార్ట్ అయింది.
గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కీర్తీ సురేశ్ కథానాయిక గా నటిస్తున్నది.
కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ కొన్ని నెలలుగా జరగలేదు. ఇప్పటికే పాట ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లకు విశేషమైన స్పందన వచ్చింది.
మహేష్ బాబు సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టా గ్రామ్ లో తెలిపారు. లైట్స్ కెమెరా యాక్షన్ ఈ మూడు పదాలు మ్యాజిక్ క్రియేట్ చేయడం ప్రారంభిస్తున్నాయని ఆమె కామెంట్ చేశారు.