29.7 C
Hyderabad
May 3, 2024 05: 38 AM
Slider హైదరాబాద్

మతి భ్రమించి మాట్లాడుతున్న రామ్ గోపాల్ వర్మ

#ramgopalvarma

హైదరాబాద్ మేయర్  గద్వాల విజయలక్ష్మి పై  సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు  దేవి రెడ్డి విజితా రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ  వీధి కుక్కల దాడిలో  బాలుడు మృతి చెందడం విచారకరమని  పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ  విజయలక్ష్మి ఇంట్లోకి 5 వేల కుక్కలను తొలి తలుపులు బిగించమని   వ్యాఖ్యలు చేయడం  ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు.

ఈ పరిస్థితి చూస్తుంటే రాంగోపాల్ వర్మ కు పిచ్చి పట్టిందని,  మతిస్థిమితం కోల్పోయి ఆయన ఎంత పడితే అంత మాట్లాడుతున్నారని  ఆరోపించారు. రాంగోపాల్ వర్మ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని,  మేయర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని  ఆమె డిమాండ్ చేశారు. నీకు దమ్ముంటే  వీధి కుక్కల కోసం  10  ఎకరాల స్థలంలో సంరక్షణ కేంద్రాన్ని నిర్మించాలని రాంగోపాల్ వర్మకు ఆమె సవాలు విసిరారు.  లేకపోతే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాంగోపాల్ వర్మకు గట్టిగా బుద్ధి చెప్తారని ఆమె హెచ్చరించారు.

సత్యంన్యూస్, అంబర్పేట్

Related posts

యోగి ‘అబ్బా జాన్’ వ్యాఖ్యలపై రచ్చ… రచ్చ

Satyam NEWS

పాదయాత్రను అడ్డుకోవడంలో విజయం

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు

Satyam NEWS

Leave a Comment