కరోనా వేళ ఆసుపత్రుల్లో భద్రతా చర్యలు ఎంతో పటిష్టంగా ఉండాలి. అలా లేకపోతే పెను ప్రమాదం జరుగుతుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పపూర్ లోని వంద పడకల ఆసుపత్రి ముందు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడం ఇక్కడ కలకలం రేపింది.
మరో 10 రోజుల్లో ప్రారంభానికి ఈ ఆసుపత్రి సిద్దం గా ఉంది. ఆసుపత్రి లోపల ఆక్సిజన్ ప్లాంట్ పరికరాలు ఫర్నీచర్ ఏర్పాటు చేస్తున్నారు.
బయట జరిగిన ప్రమాదం తో ఆసుపత్రికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఇదే ప్రమాదం లోపల జరిగి ఉంటే….?
కాగా ఈ ఆసుపత్రి ని కొద్ది రోజుల కిందట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సందర్శించారు. ఆసుపత్రి ప్రారంభానికి కావాల్సిన ఏర్పాట్లు చూడటం గమనార్హం.