తెగువ,నిబద్దత, కఠోర శ్రమ,అకుంఠిత దీక్ష,కర్తవ్యం,విధి నిర్వహణ…ఈ ఆరింటిని పుణికి పుచ్చుకున్నారు…ఆ ఆరుగురు. తెగువ అమోఘం,నిబద్దత అనిర్వచనీయం,కరోఠ శ్రమ వర్ణణాతీతం,అకుంఠిత దీక్ష చెప్పలనవి కాదు,కర్తవ్యం అస్సలు చెప్పక్కరలేదు,విధినిర్వహణ వెలకట్టలేనిది.
ఇలా ఈ ఆరు లక్షణాలు ఉన్న వారు ఎవ్వరనేగా మీ సందేహం. గతేడాది నుంచీ ప్రజలను వదలటం లేదు..మహమ్మారి కరోనా.అలాంటి సమయంలోనే తాము విధులు నిర్వ|హిస్తే ఎలాగుంటుందో..యావత్ ప్రజానీకానికి తెలియ పరిచారు.
అయితే వాళ్లకు ఆ ఆరు లక్షణాలు ఎలా అబ్బాయంటే…అందుకు మరి కొద్ది రోజుల్లో డీఐజీ బాధ్యతలు చేపట్టబోయే ప్రస్తుత విజయనగరం జిల్లా ఎస్పీ గా ఉంటున్న బీ.రాజకుమారీ అని చెప్పక తప్పదు.
ఎం.ఏ ఆంథ్ర పోలజీ చేసిన విజయనగరం డీఎస్పీ అనిల్ సమక్షంలో డివిజన్ పరిధిలో ఆరు మండలాలకు పోలీసు అధికారులుగా విధులు నిర్వహిస్తున్న మహిళా మణులు ఆ ఆరుగురూ… విజయనగరం రూరల్ సీఐ మంగవేణి, విజయనగరం వన్ టౌన్ సీఐ దేవీ,గుర్ల ఎస్ఐ లీలావతి, పూసపాటిరేగ ఎస్ఐ జయంతి, భోగాపురంలో ప్రొహిబిషనరీ ఎస్ఐ పద్మావతి, ఎస్.కోట ప్రొహిబిషనరీ ఎస్ఐ శిరీషలు.
ఈ కరోనా సమయంలో అస్సలు పోలీసులు ఏం చేస్తున్నారు..ప్రజలను వైరస్ బారిన పడకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న దానితో పాటు పలు కేసులను త్వరతిగతని పరిష్కారం చూపడంతో పాటు అభాగ్యులను,అనాధలను అక్కున చేర్చుకోవడం వంటి సామాజిక సేవలను ఓ పోలీస్ కూడా చేయొచ్చని చేసి నిరూపించారు.
మొదటగా సీఐ మంగవేణి అయితే అవసరమైతే అపరకాళీ అవతారం ఎత్తి తన కింద పని చేసే సిబ్బందిని అలెర్ట్ చేసి అతి క్లిష్టమైన హత్య కేసులను చాలా చాకచక్యంగా చిక్కుముడిని ఇట్టే విప్పే విధంగా పరిష్కరించడంలో అందివేసిన చెయ్యి.
ఇక గుర్ల ఎస్ఐ లీలావతి అయితే…సోషల్ మీడియాలో వచ్చిన యువతి కిడ్నాప్ ఉదంతం తెలుసుకుని క్షణాలలో ఘటాన స్థలికి చేరుకుని….మోడస్ ఆపరేషన్ ఆధారంగా ఆ యువతి నాటక మాడుతోందని పసిగట్టే గడసరి ఎస్ఐ.
అలాగే పూసపాటిరేగ ఎస్ఐ జయంతి విషయంలో ఎటువంటి నేరం జరిగినా ఇట్టే పసిగట్టగలిగే నేర్పరి ఆమె లో ఉంది.
మిగిలిన భోగాపురం,ఎస్.కోట ఎస్ఐలు పద్మావతి,శిరీషలు…ఇప్పుడిప్పుడే కేసులు ఎలాగుంటోయో..ఏయే కోణాల్లో పరిష్కరించాలో తెలుసుకునే స్థాయిలో ఉంటున్న వాళ్లు అభాగ్యులకు చేయూత నివ్వడంలో వారికి వారే సాటి.
ఏదైనా జిల్లాలో అదీ విజయనగరం డివిజన్ లో పని చేసే ఈ ఆరుగురు మహిళా పోలీసులు అటు ఎస్పీ,ఇటు డీఎస్పీ ఆదేశాలను తు,చ,తప్పకుండా పాటిస్తున్నారనే చెప్పాలి.