అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరికి నిరసనగా ఈ రోజు ఉదయం తాడికొండ అడ్డ-రోడ్డు సెంటర్ వద్ద భారీ ఎత్తున రాస్తారోకో జరిగింది. మూడు రాజధానుల ప్రకటనను వారు తీవ్రంగా ఖండించారు. బి.ఎన్.రావు కమిటీ తప్పుడు నివేదికకు నిరసనగా వంటా-వార్పు చేశారు.
రోడ్లపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతుకులీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తాడికొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ సంఘీభావం వ్యక్తం చేశారు.