37.2 C
Hyderabad
May 6, 2024 22: 29 PM
Slider హైదరాబాద్

అకస్మాత్తుగా చెలరేగిన మంటలు: తప్పిన ప్రమాదం

మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం హెచ్ఎంటి కాలనీ లోని మసీద్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఖాళీ ప్రదేశంలో చెత్తాచెదారం ఉండటంతో దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి.

స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి ఐ ఐ సి టి, మల్కాజిగిరి ఫైర్ స్టేషన్ అగ్నిమాపక శకటాలు చేరుకొని మంటలను ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. స్వల్పంగా పండ్ల దుకాణాలకు మంటలు వ్యాపించాయి.

ఎలాంటి ఆస్తినష్టం గాని ప్రాణనష్టం గాని జరుగలేదని మల్కాజిగిరి ఫైర్ స్టేషన్ అధికారి మల్లేశం తెలిపారు. మంటలు రావడానికి గల కారణాలు తెలియరాలేదు. ఎవరైనా సిగరెట్టు వేయడంతో మంటలు వ్యాపించి ఉండొచ్చని భావిస్తు న్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

జేపీ నడ్డాకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Satyam NEWS

వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

క్లీన్ అండ్ గ్రీన్ పై గోల్నాక డివిజన్ లో సమీక్ష

Satyam NEWS

Leave a Comment