మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం హెచ్ఎంటి కాలనీ లోని మసీద్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఖాళీ ప్రదేశంలో చెత్తాచెదారం ఉండటంతో దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి.
స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి ఐ ఐ సి టి, మల్కాజిగిరి ఫైర్ స్టేషన్ అగ్నిమాపక శకటాలు చేరుకొని మంటలను ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. స్వల్పంగా పండ్ల దుకాణాలకు మంటలు వ్యాపించాయి.
ఎలాంటి ఆస్తినష్టం గాని ప్రాణనష్టం గాని జరుగలేదని మల్కాజిగిరి ఫైర్ స్టేషన్ అధికారి మల్లేశం తెలిపారు. మంటలు రావడానికి గల కారణాలు తెలియరాలేదు. ఎవరైనా సిగరెట్టు వేయడంతో మంటలు వ్యాపించి ఉండొచ్చని భావిస్తు న్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి