40.2 C
Hyderabad
April 26, 2024 14: 10 PM
Slider ప్రత్యేకం

పరీక్షల భయంతో చిన్నారి ఆత్మహత్యాయత్నం

#Crime Scene

పదో తరగతి పరీక్షల్లో తాను పాస్ కాలేను అని తలచిన ఒక చిన్నారి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. హైదరబాద్ లోని జీయగూడ లోని శ్రీనివాస స్కూల్ లో పదో తరగతి చదువుతున్న బాలిక వచ్చేనెల రాబోయే ఫైనల్ ఎగ్జామ్స్ గురించి ఆలోచించి ఫెయిల్ అవుతాను అని భయంతో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.

శనివారం 7:30 pm సమయంలో జియాగూడ లోని తన నివాసంలో తల్లి, చెల్లి వారి వారి పనిలో ఉండగా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. రమ్య కేకలు విని తల్లి అక్కడికి చేరుకొని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు.

ఈరోజు సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ కి వెళ్లి విచారించగా రమ్య ఈ విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. 60 శాతం గాయాలతో కాలిన అమ్మాయికి ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.

Related posts

కొల్లాపూర్ మినీ స్టేడియంలో ఫ్లడ్ లైట్లు కావాలి

Satyam NEWS

పట్టాలతో పేదలకు శాశ్వత ఉపశమనం

Sub Editor 2

లాభదాయకమైన యూనిట్ల ద్వారా ఆర్ధికభివృద్ధి సాధించాలి

Satyam NEWS

Leave a Comment