పదో తరగతి పరీక్షల్లో తాను పాస్ కాలేను అని తలచిన ఒక చిన్నారి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. హైదరబాద్ లోని జీయగూడ లోని శ్రీనివాస స్కూల్ లో పదో తరగతి చదువుతున్న బాలిక వచ్చేనెల రాబోయే ఫైనల్ ఎగ్జామ్స్ గురించి ఆలోచించి ఫెయిల్ అవుతాను అని భయంతో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.
శనివారం 7:30 pm సమయంలో జియాగూడ లోని తన నివాసంలో తల్లి, చెల్లి వారి వారి పనిలో ఉండగా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. రమ్య కేకలు విని తల్లి అక్కడికి చేరుకొని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు.
ఈరోజు సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ కి వెళ్లి విచారించగా రమ్య ఈ విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. 60 శాతం గాయాలతో కాలిన అమ్మాయికి ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.