రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
కోనరావుపేట మండలం వెంకట్రావుపేట లోని పల్లెప్రకృతి వనం పక్కన గుడిసె వేసికొని జీవిస్తున్న గ్రామపంచాయతీ సపాయి కార్మికుని ఇల్లు షార్ట్ షార్కుట్ తో దగ్దమైంది.
ప్రమాదం జరిగిన సమయం లో వెంటనే ఆప్ర మత్తమవడం తో ప్రాణనష్టం జరగలేదు. కార్మికుడు తన భార్య డెలివరీ కోసం దాచుకున్న 30 వేల రూపాయలు పూర్తిగా కాలిపోయాయి.
రెండు తులాల బంగారం తోపాటు సుమారు లక్ష రూపాయల వరకు నష్టపోయారు.
తక్షణ సహాయం గా గ్రామ పంచాయతీ పాలకవర్గం 10,016,సర్పంచ్ మంతెన సంతోష్ స్వంతంగా తక్షణ సహాయం 5,000 రూ అందజేశారు.స్థానిక ఏ ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు.