39.2 C
Hyderabad
May 3, 2024 12: 09 PM
Slider హైదరాబాద్

కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

#kukatpally

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం కోసం హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్, సప్తగిరి కాలనీలో సోడియం హైపోక్లోరైడ్ రసాయనాలని పిచికారి చేయిస్తున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు.

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు  సోడియం హైపోక్లోరైడ్ రసాయనాలను  జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బంది ఎంతో శ్రమించి రసాయనాలను పిచికారి చేస్తున్నారని ఆయన అన్నారు.

కరోనా పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన అన్నారు. డివిజన్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటే కరోనా ను కట్టడి చేయడానికి అవకాశం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు, జిహెచ్ఎంసి సిబ్బంది ఉషారాణి, నరేష్, ఎస్ ఆర్ పి నాయక్ టిఆర్ఎస్ ముఖ్య నాయకులు మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఆంజనేయులు, ఎర్ర లక్ష్మయ్య, శ్రావణి రెడ్డి, బాబు శివ కుమార్, లక్ష్మణ్ పోతరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెనుకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం అస్తవ్యస్తం

Bhavani

పాలనా లోపం ప్రజలకు శాపం

Bhavani

కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకో

Satyam NEWS

Leave a Comment