కడప జిల్లా రాజంపేట యం.ఆర్.సి కార్యాలయం వద్ద ఉద్యోగుల 23% ఫిట్ మెంట్ జీవో కాపీల దగ్దం చేసి నిరసన తెలిపినారు ఫ్యాప్టో నేతలు.ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,ఉద్యోగ సంఘ నేతలు పాల్గొ న్నారు. తమ న్యాయ బద్ధమైన కోర్కెలు తీర్చే వరకు ఉద్యమం ఉదృతం చేయాలని ఈ సందర్భంగా ఫ్యాప్టో నేతలు పిలుపు నిచ్చారు.
అప్రజాస్వామిక అర్థరాత్రి GOలతో వేతనజీవుల కడుపుమీద కొట్టిన ప్రభుత్వ దుర్మార్గ వైఖరి విడనాలని కోరారు. ఆనవాయితీగా అధికారికంగా 11వ PRCపై వేసిన అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయటపెట్టకుండా, దానిని తొక్కిపెట్టి, అన్యాయంగా, అశాస్త్రీయమైన CS కమిటీ నివేదికను తెరపైకి తెచ్చి ఉద్యోగుల కడుపుమండేలా 23% ఫిట్ మెంట్ ను ప్రకటించారని ఆరోపించారు.
ఉద్యోగుల కడుపుమీద కొట్టేలా అర్థరాత్రి GOలు ఇచ్చి, ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసిన ప్రభుత్వ నిరంకుశ మొండివైఖరిని నిరసిస్తూ GO ప్రతులు దహనం చేసినట్టు తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘము నేతలు సుబ్రమణ్యం రాజు,గౌడ్, రమణ,శేషారెడ్డి, ఓబులేసు,చెంగల రాజు దండు సుబ్బారెడ్డి,రమణ నాయుడు,శారదా తదితరులు పాల్గొన్నారు.