28.7 C
Hyderabad
May 5, 2024 09: 45 AM
Slider వరంగల్

ఆన్ లైన్ లో విద్యార్ధుల్ని హెడ్ మాస్టర్ లే పర్యవేక్షించాలి

#MuluguDEO

విద్యార్ధులు ఆన్ లైన్ లో పాఠాలు వింటున్నారా లేదా చెక్ చేయాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపైనే ఉందని ములుగు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి అన్నారు.

నేడు ఆయన ములుగు లోని తెలంగాణ గురుకుల పాఠశాల ను సందర్శించారు. వారానికి ఒకసారి ప్రతి విద్యార్థి వర్క్ షీట్ లను సరి దిద్ది ఫలితాలు నమోదు చేయాలని ఆయన సూచించారు.

పాఠశాల కార్యాచరణ  ప్రణాళిక ను, దూర దర్శన్, T-sat పాఠాల టైమ్ టేబుల్, విద్యార్థుల ను దత్తత తీసుకోవడం తదితర కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.

విద్యార్థుల ను వాట్స్ అప్ గ్రూపులుగా చేసి వర్క్ షీట్స్ అందచేయడం, ఫోన్ ద్వారా అనుమానాలను నివృత్తి చేయడం మొదలగు అంశాలు ను పరిశీలన చేసి ఆయన సూచనలు చేశారు.

రికార్డ్ లు పరిశీలన చేసి అకాడమిక్ మానిటరింగ్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.

Related posts

రెండు రైళ్లు ఢీ: తృటిలో తప్పిన పెను ప్రమాదం

Satyam NEWS

మెదక్ పట్టణంలో సందడిగా ఫ్రీడమ్ రన్

Satyam NEWS

మంత్రి ఎర్ర‌బెల్లిని క‌లిసిన బ్రాహ్మ‌ణ సేవా సంఘం నూత‌న కార్య‌వ‌ర్గం

Satyam NEWS

Leave a Comment