విద్యార్ధులు ఆన్ లైన్ లో పాఠాలు వింటున్నారా లేదా చెక్ చేయాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపైనే ఉందని ములుగు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి అన్నారు.
నేడు ఆయన ములుగు లోని తెలంగాణ గురుకుల పాఠశాల ను సందర్శించారు. వారానికి ఒకసారి ప్రతి విద్యార్థి వర్క్ షీట్ లను సరి దిద్ది ఫలితాలు నమోదు చేయాలని ఆయన సూచించారు.
పాఠశాల కార్యాచరణ ప్రణాళిక ను, దూర దర్శన్, T-sat పాఠాల టైమ్ టేబుల్, విద్యార్థుల ను దత్తత తీసుకోవడం తదితర కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.
విద్యార్థుల ను వాట్స్ అప్ గ్రూపులుగా చేసి వర్క్ షీట్స్ అందచేయడం, ఫోన్ ద్వారా అనుమానాలను నివృత్తి చేయడం మొదలగు అంశాలు ను పరిశీలన చేసి ఆయన సూచనలు చేశారు.
రికార్డ్ లు పరిశీలన చేసి అకాడమిక్ మానిటరింగ్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.