30.2 C
Hyderabad
May 13, 2024 12: 16 PM
Slider క్రీడలు

స్విమ్మింగ్ ర్యాంకింగ్ పోటీలకు వేదికగా హైదరాబాద్

#swimmingfedaration

స్విమ్మింగ్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  మొదటి సారిగా స్విమ్మింగ్ ర్యాంకింగ్ పోటీలు హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ శాఖ మంత్రి డా. V.  శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్విమ్మింగ్ పోటీల నిర్వహణ పై రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

డిసెంబరు 20 తేది 23 వరకు గచ్చిబౌలి స్టేడియం స్విమ్మింగ్ ఫూల్ లో నిర్వహించే ఈత పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఈతగాళ్లు పాల్గొనున్నారని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. దేశంలో మెట్ట మొదటి సారిగా నిర్వహిస్తున్న పోటీలకు హైదరాబాద్ వేదికగా కావడంతో పాటు క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ ఆసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ , గచ్చిబౌలి స్విమ్మింగ్ ఆసోసియేషన్ అధ్యక్షుడు , ర్యాంకింగ్ పోటీల నిర్వహణ కమిటి చైర్మెన్ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి,   ప్రదాన కార్యధర్శి కొండ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలీసుల నైతికతను దెబ్బతీసే ఈనాడు కథనం

Satyam NEWS

ముంపు గ్రామాల ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS

నిశి నుండి వెలుగుకు

Satyam NEWS

Leave a Comment