31.2 C
Hyderabad
May 2, 2024 23: 19 PM
Slider ముఖ్యంశాలు

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

#RoadAccident

నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామం వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించారు.

కూలీలను తీసుకువెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని  వెనుక వైపు నుంచి పాల వ్యాను ఢీకొన్నది. దాంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో ముగ్గురికి తీవ్రగాయాలు తగిలాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమం గా ఉండటంతో నెల్లూరు పెద్దాసుపత్రి లో చేర్చారు.

అయితే అక్కడ అతను చనిపోయాడు. దువ్వూరు నుంచి విడవలూరు కు చేపల వేట కోసం కూలీలు వెళుతున్నారు.

దువ్వూరు వద్ద కూలీలు  టాటా ఏస్ వాహనం ఎక్కుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక పోలీసులు సీఐ సురేష్ బాబు నేతృత్వంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

చివ‌రి రోజు అమిత్‌షా ప్ర‌చారం

Sub Editor

తిరుమ‌ల అంజ‌నాద్రి ఆంజ‌నేయస్వామి జ‌న్మ‌స్థ‌లం

Satyam NEWS

మోదీ, కేసీఆర్ పాల‌న‌లో దేశం 40 ఏళ్లు వెన‌క్కు

Satyam NEWS

Leave a Comment