జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో చివరి రోజైన ఆదివారం బీజేపీ తరఫున ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఈ మేరకు బీజేపీ పార్టీ నుంచి ఆయన ప్రచార షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వచ్చిన వెంటనే చార్మినార్ వద్దనున్నభాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రచారం నిర్వహించనున్నట్లు కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.
ఓ వైపు శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే.