కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఖమ్మం జిల్లా మధిర మండలం గోపవరం నుంచి 25 మందితో ట్రాక్టర్ల లో దైవదర్శ నానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన లో ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.