నాగర్ కర్నూల్ పట్టణం శ్రీనగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, బిజినపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, తిమ్మాజీపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ తెలిపారు.
అమ్రాబాద్ మండలం ఈగలపెంట గ్రామవాసి ఒకరికి లింగాల మండలం అంబటిపల్లి గ్రామ లోని ఒక మహిళకు, కరోనా పాజిటివ్, నిర్ధారణ అయిందని డీఎంహెచ్ఓ తెలిపారు. ఐదుగురికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించే పనిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిమగ్నమయ్యారని డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.