సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు మండలంలోని మేళ్ల చెరువు, వెల్లటూరు, హేమ్లా తండ గ్రామపంచాయతీలలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. గ్రామపంచాయతీలలో డంపింగ్ యార్డ్, స్మశాన వాటికల పనులను పరిశీలించి 1నెల 15 రోజులలో పూర్తిస్థాయిలో కంప్లీట్ చేయాలని ఆదేశించారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా మేళ్లచెరువులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట RDO హుజూర్ నగర్, MPP, ZPTC, ZP కో ఆప్షన్ సభ్యులు, స్థానిక సర్పంచ్ లు,MPTC లు,తహశీల్దార్, MPDO, MPO, APO, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.