విశాఖపట్నంలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పొగ గొట్టం నుండి మంటలు ఎగసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం లో ఒకరి పరిస్థితి విషమంగా వుంది.
హెచ్ పి సిఎల్ లోని wwtp వద్ద పనులు చేస్తుండగా ప్రకాష్ నగర్ కు చెందిన చిట్టిబాబు అనే వ్యక్తి పడిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
తోటి కార్మికుల సహాయంతో ఆసుపత్రికి తరలించి చివరకు కేజీహెచ్ కి చికిత్స నిమిత్తం తరలించారు. మంటలు అగిపోవడం తో స్థానికులు ఉపిరి పీల్చుకున్నారు.