తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో విశ్రాంత ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. దోమకొండ గడీకోటలోని లక్ష్మీబాగ్ లో దహన సంస్కారాలు నిర్వహించే క్రమంలో తేనెటీగలు చెలరేగడంతో ఆటంకం కలిగింది. తేనెటీగలు ఒక్కసారిగా రావడంతో అందరూ భయంతో పరుగులు తీశారు.
అంత్యక్రియలకు హాజరైన సినీనటుడు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ , ఉపాసన తదితరులు ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపటి తర్వాత తేనెటీగలు వెళ్లిపోవడంతో అంత్యక్రియలు కొనసాగాయి.
ఉమాపతిరావు కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ , జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ లాల్ పవార్ , అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పలువురు ప్రముఖులు పరామర్శించారు.