కరోనా సమయంలో మూగజీవాలకు సేవ చేయాలనే ఆలోచనతో పశువులను గడ్డిమోపులను బిజెపి నేతలు అందచేస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి నేడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంకు గడ్డిమోపులను అందచేశారు.
వేములవాడ లోని కోడెలకు వీటిని దాణాగా పెట్టాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షులు రామకృష్ణ తో సమావేశమయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై వారు చర్చించారు.