హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ గురువారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నిరుపేదలు నివసించే పలు ప్రాంతాల్లో పేదలకు, వృద్ధులకు మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ అధినేత్రి, మేనేజింగ్ ట్రస్టీ మౌనికారెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు.
అందులో భాగంగానే హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద వేచి ఉండే పేద రోగుల బంధువులకు ఆమె ఆహారాన్ని అందచేశారు. ఈ సందర్భంగా మౌనికారెడ్డి మీడియాతో మాట్లాడుతూ “MCF – అన్నదాత” స్కీం ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఫౌండేషన్ సభ్యులు, వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు
కె.రమాకాంత్, వెంకటగిరి సామాన్యుడు