38.2 C
Hyderabad
April 28, 2024 19: 45 PM
Slider కరీంనగర్

వరద ప్రాంతాల రైతుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

#MLASridhababu

భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటన జరిపారు. మల్హర్ మండలంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు.

ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నీట మునిగిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందిచాలని ఆయన కోరారు.

భారీ వర్షలతో  దెబ్బతిన్న పంటలను వెంటనే సర్వే చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఆయన అన్నారు. భారీ వర్షాల కారణంగా కోతల కు గురైన రహదారులను  వెంటనే మరమ్మతులు చేయాలని శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.

మల్లారం బ్రిడ్జి మరమ్మతులు చేయాలని R&B  అధికారులను శ్రీధర్ బాబు కోరారు. ఇండ్లు కూలిపోయిన కుటుంబాలను  అన్ని విధాలుగా ఆదుకోవాలని శ్రీధర్ బాబు ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.

Related posts

అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

నాగర్ కర్నూల్ లో 27వ తేదీ నుంచి ప్రజావాణి పునః ప్రారంభం

Satyam NEWS

ఇజ్రాయిల్ నిర్ణయం.. పాలస్తీనీయన్లకు గుర్తింపు కార్డులు

Sub Editor

Leave a Comment