కడప జిల్లా రాజంపేట పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద శ్రీ కాంత్ ఫోటో స్టూడియో అధినేత శ్రీధర్ కరోనా మహమ్మారి మూలంగా ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. గురువారం స్వయంగా స్కూటర్ పై బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, బైపాస్ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ యాచకులకు, వృద్ధులకు, పేదలకు ఆహార పొట్లాలు అందించారు.
భిక్షాటన చేసేవారికి, పేద వారికి కరోనా ఆంక్షల మూలంగా ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది. తన వంతు సాయంగా కొందరికైనా ఆకలి తీర్చేందుకు శ్రీధర్ ప్రతి రోజు మధ్యాహ్నం స్వయంగా తిరిగి ఆహార పొట్లాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ విధంగా మానవత్వం తో ఆహారం అందించేందుకు శ్రీధర్ లా ముందుకు రావాలని అందరూ కోరుకుంటున్నారు.