కడప జిల్లా రాజంపేట మండలం బసినాయుడు గారిపల్లె గ్రామ సరిహద్దులను గురువారం గ్రామస్తులు మూసివేశారు. రోడ్లపై చెట్లువేసి గ్రామస్తులు తమ గ్రామానికి ఎవరూ రావద్దని ప్రకటించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కరోనా కట్టడి కోసం ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్టి వారు తెలిపారు.
మాజీ సర్పంచి, రాష్ట్ర బీ.జే.వై.యం అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా పంజా విసరడంతో దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరాయని, జన సమర్ధం ఉండే గుడి, బడి, వ్యాపార వాణిజ్య సముదాయాల ను మూసి వేయాలని ఆదేశించారని అన్నారు.
ఈ మేరకు ఏప్రిల్ 14 వరకు కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ ను ప్రజలు అందరూ పాటించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో రాజంపేట లోనే బసినాయుడు గారిపల్లె లోని ప్రజలు కరోనా కట్టడి లో భాగంగా హద్దులను మూసివేశారని ఆయన తెలిపారు.