నాంపల్లి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాల్ ను ప్రారంభించారు. పిసిసిఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, ముఖ్యమంత్రి ఓఎస్ డి ప్రియాంక వర్గీస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ అటవీశాఖ గత ఎనిమిది ఏళ్లుగా చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, తెలంగాణకు హరితహారం కింద అభివృద్ధి చేసిన వివిధ కార్యక్రమాల నమూనాలు తెలిపే విధంగా ఫారెస్ట్ స్టాల్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ను సందర్శించే పర్యాటకులు, పిల్లలు, పెద్దలు అడవుల ప్రాధాన్యతను తెలుసుకునే విధంగా డిస్ ప్లే ఏర్పాటు చేశారు. ఔషధ మొక్కల స్టాల్, ప్రత్యేకంగా పిల్లల కోసం మినీ జూ ఏర్పాటు చేశారు.
previous post