కడప జిల్లా దువ్వూరు మండలంలోని గుడి పాడు గ్రామ సమీపంలో గంజాయి, దొంగ నోట్లు చలామణి చేస్తున్న 5 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో గతంలో పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి.
వీరి వద్ద నుంచి 40 లక్షల విలువ గల 30 కేజీల గంజాయి,3 కార్లు, 500 రూపాయల 7 నకిలీ నోట్లు,5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ తుషార్ దు,డి మైదుకూరు డిఎస్పీ వంశీదర్ గౌడ్, మైదుకూరు రూరల్ సీఐ నరేంద్ర రెడ్డి, దువ్వూరు ఎస్సై రాఘవేంద్ర రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.