విజయనగరం రోటరీ డి.ఎన్.ఆర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ద్వారా నడుపబడుతున్న రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ లో త్యాగరాజ స్వామి, అలాగే హరికథ పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు స్మరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. డాక్టర్ డి. వి.శ్రీకాంత్, ఉసిరికల చంద్రశేఖర్ రావు, డి.బాలాజీ, సూర్యలక్ష్మి, ఉమా బాలాజీ, వీరభద్రరావు తదితరులు పాల్గొని త్యాగరాజ స్వామి, నారాయణదాసు చిత్రపటాలకి పూలమాలాలంకరణ చేశారు.
అధ్యాపకులు డాక్టర్ పద్మప్రియ, రవికుమార్, వంశీకృష్ణ, కామేశ్వర రావు, రామచరణ్, భానుహర్ష, మహేశ్వరరావు, దుర్గాప్రసాద్, హరికథ అధ్యాపకులు కాళ్ళ నిర్మల, ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక రవి, విద్యార్థులు పాల్గొన్నారు… త్యాగరాజ స్వామి, నారాయణ దాస కీర్తనలు ఆలపించారు.
ఇక 12వ తేదీన రోటరీ మ్యూజిక్ అకాడమీ, ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధన ఉదయం 8 గం. లకు శ్రీ పైడితల్లి అమ్మవారి కోవిల నుండి తిరువీధి అనంతరం మన్నార్ రాజగోపాలస్వామి కోవిలలో పంచరత్న బృందగానం స్థానిక విద్వాంసులచే ఉంటాయని డా.మండపాక రవి తెలిపారు.