31.7 C
Hyderabad
May 2, 2024 07: 12 AM
Slider అనంతపురం

క్యాన్సర్ రోగికి ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల

#mlagonuguntlasuryanarayana

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మరో మారు తన ఉదారతను చాటుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక రోగికి సోమవారం తన వంతు ఆర్థిక సహాయం అందించారు. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం లోని ముదిగుబ్బ మండలం సిరిగారిపల్లి గ్రామానికి చెందిన రమేష్ బాబు కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.

సోమవారం ఉదయం సిరి గారి పల్లి గ్రామానికి చెందిన రమేష్ బాబు తండ్రి, కొందరు గ్రామస్తులు
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ను కలిశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలోనే రమేష్ బాబు అనారోగ్య విషయం గ్రామస్తులు తెలియజేశారు.

అతని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల వెంట వచ్చిన రమేష్ బాబు తండ్రికి 20వేల రూపాయల నగదును వైద్య ఖర్చులకోసం గ్రామస్తుల సమక్షంలో గోనుగుంట్ల సూర్యనారాయణ అందజేశారు. రమేష్ బాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గోనుగుంట్ల చేసిన సహాయం పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో స్వల్ప మార్పులు

Bhavani

వనపర్తిలో గంజాయి, మద్యం, పొగ సేవిస్తున్న వారిపై వల

Satyam NEWS

మత మార్పిడి చట్టంపై జబల్ పూర్ హైకోర్టు కీలక తీర్పు

Satyam NEWS

Leave a Comment