ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ చిన్న చెరువు దుర్వాసన రావడంపై పరిసర ప్రాంతాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఉప్పల్ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఎడ్ల పరమేశ్వర్ స్పష్టం చేశారు. సోమవారం బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు ఎడ్ల పరమేశ్వర్ ఆధ్వర్యంలో ఉప్పల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి కి రామంతపూర్ చిన్న చెరువు ను ప్రక్షాళన చేసీ దుర్వాసనను అరికట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని మెమోరాండం అందజేశారు.
ఈ సందర్భంగా ఎడ్ల పరమేశ్వర్ చెరువును పూర్తిగా ప్రక్షాళన చేసి శుభ్రం చేయించాలని కమిషనర్ అరుణ కుమారి కి వివరించారు. వెంటనే కమిషనర్ స్పందించి మంగళవారం చెరువును పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎడ్ల పరమేశ్వర్ మాట్లాడుతూ రామంతపూర్ చిన్న చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు దుర్వాసనతో అనేక రోగాల భారీ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసనతో కాలనీవాసులు అస్తవ్యస్తంగా బతుకుతున్నారని దుర్వాసన భారీ నుండి ప్రజలను కాపాడాలని డిప్యూటీ కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంకల్ప ఫౌండర్ బాపట్ల కృష్ణమోహన్, సత్యనారాయణ, సాయి, సునీల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా